త్యాగానికి ప్రతీక బక్రీద్
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:21 AM
పట్టణంలో బక్రీద్ను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో వేడుకలు
పేదలకు సాయం చేయాలని సందేశం ఇచ్చిన మత గురువులు
నమాజ్ చేసిన ముస్లింలు
ఆదోని అగ్రికల్చర్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో బక్రీద్ను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వార్డులోని 60మసీదులలో ఈద్ నమాజ్ చేశారు. షాహి జామియా మసీద్ గురువు కతీబ్ సాబ్ జునేద్ హస్మి మాట్లాడుతూ ప్రవక్త ఇబ్రహీం త్యాగం ఆదర్శనియమన్నారు.
పత్తికొండ: స్థానిక ఈద్గావద్ద మతపెద్దలు ఖురాన్ అంశాలను బోదించారు. బక్రీద్ దానధర్మాలకు ప్రతీకను పేదలకు సాయం చేయాలని సూచించారు. పట్టణంలోని తేరుబజార్ పెద్దమసీదును విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఆలూరు: పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు నమాజ్ చేశారు. మత గురువులు సందేశం అందజేశారు.
దేవనకొండ: స్థానిక ఈద్గాకు ర్యాలీగా ఈద్గాకు చేరుకుని నమాజ్ చేశారు. తుగ్గలి, క్రిష్ణగిరి, చిప్పగిరి, మద్దికెర, వెల్దుర్తి మండలాల్లో వేడుకలు నిర్వహించారు.
Updated Date - Jun 08 , 2025 | 12:21 AM