విద్యార్థినికి ఎమ్మెల్యే అభినందన
ABN, Publish Date - May 17 , 2025 | 12:23 AM
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో విద్యార్థిని రాష్టస్థాయి ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని లాస్యరెడ్డిని ఎమ్మెల్యే శాంబాబు అభినందించారు.
పత్తికొండ, మే 16 (ఆంధ్రజ్యోతి): సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో విద్యార్థిని రాష్టస్థాయి ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని లాస్యరెడ్డిని ఎమ్మెల్యే శాంబాబు అభినందించారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విద్యార్థిని లాస్యరెడ్డిని ఎమ్మెల్యే సన్మానించి, లాప్టాప్ బహుకరించారు. వెనుకబడ్డ పత్తికొండ ప్రాంతంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమన్నారు. ఇక్కడి ప్రాంత విద్యార్థులు ఉద్యోగ అవకాశాల్లో ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భోరసానిచ్చారు. సాంబశివారెడ్డి ఉన్నారు.
Updated Date - May 17 , 2025 | 12:23 AM