దరఖాస్తులను గడువు లోపు పరిష్కరించాలి: జేసీ
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:41 AM
పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జేసీ బి.నవ్య అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జేసీ బి.నవ్య అధికారులను ఆదేశించారు. కర్నూలు కలె క్టరేట్ సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జేసీ ప్రజల నుంచి వినతు లను స్వీకరించిన అనంతరం పరిష్కారంపై అధికారులతో సమీక్షిం చారు. పీజీఆర్ఎస్లో లాగిన్లో పరిష్కారం చేసిన అర్జీలను ఆడిట్ చేయాల్సి ఉందన్నారు. అర్జీల ఆడిట్ పెండింగ్ లేకుండా చూసుకోవా లన్నారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను అలసత్వం వహిం చకుండా పెండింగ్లో లేకుండా ఎప్పుటికప్పుడు చూడాలన్నారు. సీఎంవో గ్రీవెన్స్కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 8, కర్నూలు ఆర్డీవో వద్ద 3, పత్తికొండ ఆర్డీవో వద్ద 3, కలెక్టరేట్ ఏవో వద్ద, 3, సర్వే ఏడీ, కార్మిక శాఖ, ఐసీడీఎస్ పీడీ వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని బియాండ్ ఎస్ఎల్ఏలో వెళ్లకుండా పరిస్కరించాలన్నారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 12:41 AM