ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:18 AM
దళిత సర్పంచును అవమానిం చిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ నగర కమిటీ నాయకులు భాస్కర్, యేసురాజు డిమాండ్ చేశారు.
కల్లూరు, జూన 19(ఆంధ్రజ్యోతి): దళిత సర్పంచును అవమానిం చిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ నగర కమిటీ నాయకులు భాస్కర్, యేసురాజు డిమాండ్ చేశారు. గురువారం కేవీపీఎస్ న్యూసిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూరైన నేపథ్యంలో ఆదోని మండలం ఢనాపురంలో జరుపుకున్న విజయోత్సవ వేడుకల్లో ర్యాలీ అనంతరం గుడికట్ట వద్ద సభ నిర్వహించారు. గ్రామ సర్పంచును ఎస్సీ అనే కారణంతో వేదిక పైకి రాకుండా ఎమ్మెల్యే పార్థసారధి, గుడిసె క్రిష్ణమ్మ అతన్ని నియం త్రించారని ఆరోపించారు. దళిత సర్పంచును అవమానించిన ఎమ్మెల్యే టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jun 20 , 2025 | 12:18 AM