ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎందుకిట్లు?

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:45 AM

గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఉమ్మడి కృష్ణా జిల్లా క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలోని టూల్‌ ్స స్టోర్‌రూమ్‌లో రూ.కోటి విలువ చే సే పరీక్ష పరికరాలు (టెస్టింగ్‌ టూల్స్‌) మాయమయ్యాయి. టూల్స్‌ రూమ్‌ను పర్యవేక్షించాల్సిన సిబ్బందే వీటిని మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

విజయవాడలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయం

ఆర్‌డబ్ల్యూఎస్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో టూల్‌ కిట్లు మాయం

రూ.కోటి విలువచేసే పరికరాలు ఏడాది కిందటే అదృశ్యం

బయటకు తరలించి భారీగా సొమ్ముచేసుకున్న ఇంటిదొంగలు

బయటకు పొక్కనీయకుండా ఇన్నాళ్లూ జాగ్రత్తలు

కిట్లు లేకుండానే క్వాలిటీ కంట్రోల్‌ పనులు

నలుగురు డీఈఈలు మారినా గప్‌చుప్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఉమ్మడి కృష్ణా జిల్లా క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలోని టూల్‌ ్స స్టోర్‌రూమ్‌లో రూ.కోటి విలువ చే సే పరీక్ష పరికరాలు (టెస్టింగ్‌ టూల్స్‌) మాయమయ్యాయి. టూల్స్‌ రూమ్‌ను పర్యవేక్షించాల్సిన సిబ్బందే వీటిని మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏడాదిలో ఈ విభాగానికి డీఈఈలు మారినా బయటకు రాకుండా తొక్కి పెట్టారు. ఈ సంవత్సరంలో ఎలాంటి టూల్స్‌ లేకుండానే క్వాలిటీ కంట్రోల్‌ పూర్తి చేస్తున్నారు. టూల్స్‌ లేకుండా క్వాలిటీ కంట్రోల్‌ ఎలా చేశారో, పనులను ఎలా నిర్ధారించారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిని బట్టి బిల్లుల చెల్లింపులో భారీ ఎత్తున అవినీతి వ ్యవహారాలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయి.

ఇంటిదొంగల పనేనా?

బందరు రోడ్డు వెంబడి అంబేడ్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు అభిముఖంగా ఉమ్మడి జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయం ఉంది. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలకు కలిపి ఇక్కడే క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగానికి సంబంధించిన పనులను పరిశీలించి, వాటిని ధృవీకరిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక డీఈఈ అధికారి ఉంటారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎక్కడ పనులు జరిగినా వాణి నాణ్యతను పరిశీలించటంతో పాటు వర్‌ ్క ఆర్డర్‌ ప్రకారం నిర్దేశించిన పరిమాణంలో మెటీరియల్‌ కొన్నారా? లేదా? వాటి వాస్తవ పరిమాణం ఎంత? ఏ రకానికి చెందినవి? సర్టిఫై చేసినవా? కాదా? వాటి నాణ్యత ఎలా ఉంది? ఇలా అనేక అంశాలను పరిశీలిస్తారు. పరిశీలన తర్వాతే ధ్రువీకరించి బిల్లు చెల్లింపులు జరుగుతాయి. రెండేళ్ల కిందట ఇంజనీర్‌ ఇన చీఫ్‌ (ఈఎనసీ) గాయత్రి దాదాపు రూ.కోటిన్నర విలువ చేసే టూల్స్‌ను విజయవాడలోని క్వాలిటీ కంట్రోల్‌ కేంద్రానికి తెప్పించారు. ఇంటిదొంగలే వీటిని మాయం చేసి బయట అమ్ముకున్నట్టు తెలుస్తోంది. విలువ రూ.కోటి ఉంటుందని సమాచారం. ఈ టెస్టింగ్‌ టూల్స్‌ను అసలు ఉపయోగించలేదని తెలుస్తోంది.

పరీక్షలు ఎలా చేశారు?

టెస్టింగ్‌ టూల్స్‌ లేకుండా క్వాలిటీ కంట్రోల్‌ పరీక్షలు ఎలా చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. టూల్స్‌ ఉపయోగించకుండా పనుల పరిశీలన అసాధ్యం. కాంట్రాక్టర్లతో లాలూచీ పడి, పనులను టూల్స్‌తో చేసినట్టుగా రికార్డుల్లో చూపినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్లతో ఉన్న సంబంధాల కారణంగా మమ.. అనిపించారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఐదుగురు డీఈఈలు మారినా..

టూల్స్‌ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి సంబంధించి ఐదుగురు డీఈఈలు మారారు. ప్రతి డీఈఈ బదిలీ అయిన సందర్భంలో బాధ్యతలు అప్పగించే ముందు వీటి లెక్కలను కొత్త డీఈఈకి తెలిపారు. కానీ, అలా చేయలేదు.

సాగు భూములు..

చెరువులుగా..

గూడవల్లి కోదండ రామాలయ సాగు భూముల్లో మార్పులు

8 నందివాడలోని 8 ఎకరాల వ్యవసాయ భూములు చేపల చెరువులుగా..

8 వ్యవసాయానికి లీజుకు తీసుకుని ఇష్టానుసారంగా..

8 వేలాది క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలు.. విక్రయాలు

8 దేవదాయ శాఖ కిందిస్థాయి అధికారుల సహకారంతోనే..

8 చెరువుల తవ్వకాలపై దేవదాయ కమిషనర్‌కు ఫిర్యాదులు

పచ్చగా కళకళలాడే ప్రభుత్వానికి చెందిన పంట భూములు ఒక్కసారిగా చేపల చెరువులుగా మారిపోయాయి. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన దత్తత ఆలయమైన గూడవల్లి గ్రామంలోని కోదండ రామాలయానికి చెందిన 8 ఎకరాల సాగు భూములను లీజుదారులు చేపల చెరువులుగా మార్చేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు అండగా నిలిచి వంత పాడారు. పవిత్రమైన ఆలయ భూములపై అన్యుల ఇష్టానుసార మార్పులపై అధికారులకు ఫిర్యాదులు అందగా, ఆ అవినీతి చేపను పట్టుకునే పనిలో అధికారులు పడ్డారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /నందివాడ/వనటౌన) : గూడవల్లి గ్రామంలోని కోదండ రామాలయానికి మొత్తం 24 ఎకరాల భూమి ఉంది. 16వ నెంబర్‌ జాతీయ రహదారి వెంబడి 7, బుడమేరు కట్ట వెంబడి 8 ఎకరాలు ఉన్నాయి. అలాగే, నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో మరో 8 ఎకరాలు ఉన్నాయి. గూడవల్లిలో లోపల వైపు మిగిలిన భూములున్నాయి. వీటిలో నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలోని 8 ఎకరాల వ్యవసాయ భూమి చేపల చెరువులుగా మారిపోయింది. ఈ భూములను రెండు చెరువులుగా తవ్వించారు. వ్యవసాయం సాగు కోసమని లీజుకు తీసుకుని చేపల చెరువులుగా మార్చేశారు. చేపల చెరువుల తవ్వకం పేరుతో లీజుకు తీసుకున్న భూమిలోని వేలాది క్యూబిక్‌ మీటర్ల మట్టిని కూడా అమ్మేసుకున్నారు. దేవదాయ శాఖ అనుమతులు లేకుండా, వారికి పైసా చెల్లించకుండా వ్యవసాయ సాగు లీజు పేరుతో అక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఆ తర్వాత ఏటా చేపల చెరువులుగానే వీటిని లీజుకు ఇస్తున్నారు. దేవదాయ శాఖలోని కిందిస్థాయి అధికారులు.. లీజుదారులతో చేతులు కలిపి ఈ అక్రమానికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో ఈ భూములు రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగా ఉంటే, దేవదాయ శాఖ లెక్కల్లో చేపల చెరువులుగా చూపిస్తున్నాయి. దేవదాయ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్‌ వ్యక్తులు మార్చుకునే వీల్లేదు. వ్యవసాయం కోసం తీసుకున్న భూములను చేపల చెరువులుగా మార్చే అధికారమూ ఉండదు.

మార్చిందెవరు?

నందివాడలోని 8 ఎకరాలను క్రమం తప్పకుండా లీజుకు ఇస్తున్నారు. లీజులకు తీసుకున్న వారిలో ఎవరు చేపల చెరువు తవ్వారో తెలుసుకోవడం గగనంగా మారింది. కొంతకాలంగా చేపల చెరువుగా కొనసాగుతుండటంతో అసలు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడిచిందనేది ప్రశ్నార్థకంగా ఉంది. లీజుల ఫైల్‌ను పరిశీలిస్తే.. అసలు సూత్రధారి ఎవరనేది తెలుస్తుంది. వ్యవసాయ లీజులకు తీసుకున్నవారు కాకుండా, మొదటిసారిగా చేపల చెరువు పేరుతో లీజు తీసుకున్నదెవరన్నది తెలుసుకుంటే విషయం బయటపడే అవకాశముంది.

దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు

వ్యవసాయ భూములు చేపల చెరువులుగా మారిపోయిన ఉదంతంపై పలువురు ఆధారాలతో సహా దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చే శారు. ఈ విషయంపై విచారణ జరపాలని కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు అందాయి.

నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో చేపల చెరువులుగా మారిన వ్యవసాయ భూములు ఇవే..

Updated Date - Jul 08 , 2025 | 12:45 AM