గ్రీన్ కంప్యూటింగ్పై లయోలలో ప్రత్యేక సదస్సు
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:22 AM
ఆంధ్ర లయోలా కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ మాస్టర్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం గ్రీన్ కంప్యూటింగ్ అనే అంశంపై ప్రత్యేక సదస్సు జరిగింది.
గ్రీన్ కంప్యూటింగ్పై లయోలలో ప్రత్యేక సదస్సు
భారతీనగర్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర లయోలా కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ మాస్టర్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం గ్రీన్ కంప్యూటింగ్ అనే అంశంపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ డేటా సైంటిస్ట్ సయ్యద్ వసీం అక్రమ్, డీహెచ్ఎల్ ఆర్కిటెక్ట్ కళాశాల ప్రిన్సిపాల్ వి.రమేష్, ముఖ్య అతిఽఽథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కంప్యూటర్లో స్థిరమైన పద్ధతులను వివరించారు. సాంకేతికతలో స్థిరత్వం ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జి. కిషోర్, కరస్పాండెంట్ ఫాదర్ ఎం సగయరాజ్, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ ప్రభుదాస్, ఎంసీఏ హెచ్వోడీ మేరీమంజుల రాణి, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టెక్నాలజీతో భవిష్యత్ ప్రణాళికపై..
ఆంధ్రా లయెలా ఇంజనీరింగ్ కళాశాలలో ఫాదర్ జోజిరెడ్డి సమక్షంలో ఐక్యూఎసీ, సైన్ అం డ్ హ్యూ మానిటీస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం టెక్నాలజీతో భవిష్యత్ ప్రణాళిక అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విష్ణు వందన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ కమ్యూనికేషన్ నైపుణ్యాలు భవిష్యత్కు ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ బాలస్వామి, ఫాదర్ మహేష్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సిస్టర్ క్యాండీకూనా, కళావతి, పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:22 AM