‘ఇది తెలుగుదేశం పార్టీ విజయం’
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:47 PM
ఒంటిమిట్ట ఎంపీపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడం ఆ పార్టీ విజయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
ఒంటిమిట్ట, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : ఒంటిమిట్ట ఎంపీపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడం ఆ పార్టీ విజయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థా నిక మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ నల్లగొండు లక్ష్మీదేవి బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ విజయడంకా మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, ప్రముఖ వైద్యుడు మధుసూదనరెడ్డి, టీడీపీ నాయకులు వెంకటసుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, రఘురాంరెడ్డి, వినోద్రెడ్డి ఎంపీటీసీ బాషా, ఎంవీ రమణ, కట్టా యానాదయ్య పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:47 PM