పొంచి ఉన్న ప్రమాదం
ABN, Publish Date - May 30 , 2025 | 12:10 AM
కూనవారిపల్లె- సీతానగరం రహదారిలోని హెల్త్ క్లీనిక్ వద్ద వేపచెట్టు నిలువునా ఎండిపోయి ఎప్పుడు కూలుతుందో అన్నట్లు ప్రమాదక రంగా మారింది.
ఖాజీపేట, మే 29 (ఆంధ్రజ్యోతి): కూనవారిపల్లె- సీతానగరం రహదారిలోని హెల్త్ క్లీనిక్ వద్ద వేపచెట్టు నిలువునా ఎండిపోయి ఎప్పుడు కూలుతుందో అన్నట్లు ప్రమాదక రంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎండిపోయిన చెట్టు నుంచి కొమ్మలు విరిగి రోడ్డుపై పడుతున్నాయి. ప్రతినిత్యం ఈ దారిలో వాహన దారులతోపాటు పాదచారులు తిరుగుతుం టారు. స్కూల్ సెలవులు ముగుస్తుండడంతో పిల్లలు కూడా ఇదే దారిలో స్కూ ల్కు వెళ్లాల్సి ఉంటుంది. ఏవైనా ప్రమాదం జరుగక మునుపే ఆ చెట్టును తొలగించాలని గ్రామప్రజలు కోరుతున్నారు. ఈదారిన అధికారులు వెళుతున్నా చూసీచూడనట్లు ఉంటున్నారని విమర్శలు న్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎండిన చెట్టును తొలగించి ప్రమాదం జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - May 30 , 2025 | 12:10 AM