టీడీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలి
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:03 AM
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి దేవగుడి భూపేశ్రెడ్డి పిలుపునిచ్చారు.
జమ్మలమడుగు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి దేవగుడి భూపేశ్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో అబ్జర్వర్లు, క ్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూపేశ్రెడ్డి మాట్లాడుతూ రానున్నస్థానిక సంస్థల ఎన్నికల్లో మండలాలు, గ్రామాల్లో అబ్జర్వర్లతో కలిసి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లి పార్టీకోసం బాగా పనిచేయాలన్నారు.అనంతరం జమ్మలమడుగు నియోజకవర్గానికి అబ్జర్వర్లుగా టీడీపీ అధిష్టానం నియమించినవారికి సన్మానం చేశారు. వారు భూపేశ్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మార్కెట్యార్డు ఛైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు మద్దూరి రామకృష్ణ, ఎన్నికల అబ్జర్వర్లు దుద్యాల అనితాదీప్తి, హరిప్రసాద్నాయుడు, నియోజకవర్గ మండలాల అబ్జర ్వర్లు , క్లస్టర్, యూనిట్ బూత్ ఇన్చార్జిలు, పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు, నాయకులు కర్నాటి రామాంజనేయరెడ్డి, లక్ష్మణనాయుడు, బిర్రు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయండి
కలసపాడు, జూన 26 (ఆంరఽధజ్యోతి): తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అందరు కలిసికట్టుగా పనిచేయాలని కడప పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు, కలసపాడు మండల పరిశీలకుడు ఖాదర్బాష పేర్కొన్నారు. గురువారం టీడీపీ కార్యాలయలో బూత కన్వీనర్ల సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వ హించారు. టీడీపీ మడల అద్యక్షుడు వెంకటరామిరెడ్డి అధ్యక్షతన సమావేశం లో ఖాదర్బాష మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి పార్టీ బలో పేతానికి ప్రత్యేకశ్రద్దతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కె ట్ యార్డు చైర్మన సాధనకారి రంతు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలిరెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పట్టాభిరెడ్డి, యువత నాయకులు శ్రావణ్కుమార్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, దుగ్గిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రామసుబ్బ య్య, నీటిసంఘం అధ్యక్షులు, మాఈ సర్పంచులు పాల్గొన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 12:03 AM