మామిడి రైతులకు బీమా అందించాలి
ABN, Publish Date - May 05 , 2025 | 11:27 PM
జిల్లా వ్యా ప్తంగా నష్టపోయిన మామిడి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇ న్సూరెన్స అందించాలని ఆంధ్రప్రదేశ రై తు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ శ్రీధర్కు వినతిపత్రం అందించారు.
రాయచోటి(కలెక్టరేట్), మే5(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యా ప్తంగా నష్టపోయిన మామిడి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇ న్సూరెన్స అందించాలని ఆంధ్రప్రదేశ రై తు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ శ్రీధర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామిడి పంట మూడు సంవత్సరాల నుంచి అరకొర రావడం, వచ్చిన పంట కూడా చేతికి అందకుండా అకాల వర్షాలతో గాలి, వానలతో నేలపాలవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లు తోందన్నారు. దెబ్బతిన్న మామిడి తోటలను అధికార పార్టీ నాయకులు కానీ, హార్టికల్చర్ అధికారులు పరిశీలించకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం మా మిడి తోటల్లో డిసెంబర్లో పూత రావాల్సి ఉండగా ఫిబ్రవరి మొదటి వారంలో తోటలన్నీ విరగ పూశాయన్నారు. దీతో రైతులు ఈసారి కాపు బలంగా వస్తుందని ఆశ పడ్డారన్నారు. అయితే పది రోజులకే మామిడి పూత పూర్తిగా రాలిపోయిందన్నారు. ఈ పరిస్థితులను తట్టుకోవాలంటే రైతులకు బీమా తప్పనిసరి అన్నారు. రైతు సంఘం నాయకులు హరినాధనాయుడు, బాలక్రిష్ణారెడ్డి, కేవీ రమణ పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2025 | 11:27 PM