ఏపీలో అరాచకానికి విముక్తి కలిగి ఏడాది పూర్తి
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:17 AM
ఏపీలో అరా చకపాలనకు విముక్తి కలిగి ఏడాది పూర్తిచేసుకుని కూట మి ప్రభుత్వపాలనలో ప్రజ లు సంతోషంగా ఉన్నారని మున్సిపల్ వైస్ చైర్మన వైఎస్ జబివుల్లా పేర్కొన్నా రు.
ప్రొద్దుటూరు , జూన 4 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అరా చకపాలనకు విముక్తి కలిగి ఏడాది పూర్తిచేసుకుని కూట మి ప్రభుత్వపాలనలో ప్రజ లు సంతోషంగా ఉన్నారని మున్సిపల్ వైస్ చైర్మన వైఎస్ జబివుల్లా పేర్కొన్నా రు. బుఽధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడుతూ 2019 నుంచి 2024 జూన 4 వరకు వైసీపీ అవినీతి అరాచక పాలన సాగిందన్నారు. సభలు పెడితే రాళ్ళ దాడి చేయించారన్నారు. ప్రొద్దుటూ రులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అరాచక కార్యక్రమాలను ప్రోత్సహించి అక్రమంగా వందల కోట్టు సంపాదించాడని ఆరోపించారు. అంతకు ముందు కూటమి పాలన ఏర్పడి ఏడాది అయిన సందర్బంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు జరుపుకు న్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, తలారి రమేష్ దుగ్గిరెడ్డి రఘునాధరెడ్డి, యోగివేమన యూనివర్శిటి నానటీచింగ్ స్టాప్ అధ్యక్షుడు రసూల్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:17 AM