వీరచౌడేశ్వరిదేవి జయంతి సందర్భంగా అన్నదానం
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:26 PM
రాజంపేటలోని పాతబస్టాండ్ సమీపంలో వీరచౌడేశ్వరిదేవి జయంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ సహకారంతో అన్నదానం నిర్వహించారు.
రాజంపేట, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : రాజంపేటలోని పాతబస్టాండ్ సమీపంలో వీరచౌడేశ్వరిదేవి జయంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్సనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి జయంతి సందర్భంగా పేద ప్రజలకు ఆకలి తీర్చడంలో అన్నదాన కార్యక్రమం ఎంతో ఉపయోపడుతోందన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.హరిప్రసాద్, బీజేపీ మండల ఉపాఽధ్యక్షులు డాక్టర్ రేణుప్రసాద్రాజు, బీజేపీ జిల్లా నాయకులు హిమగిరియాదవ్, తోట నగేష్ పట్టణ ఉపాధ్యక్షులు పి.మహేష్, ఎస్వీమోర్చ పట్టణ అధ్యక్షులు ప్రవీణ్కుమార్, కె.హరిప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 11:26 PM