AP High Court Judge: 28న జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం
ABN, Publish Date - Jul 23 , 2025 | 05:51 AM
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఆయనతో ...
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ బట్టుదేవానంద్ 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2023 మార్చిలో మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ దేవానంద్ను మద్రాస్ హైకోర్టు నుంచి తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
Updated Date - Jul 23 , 2025 | 05:51 AM