Visakhapatnam: ఈకేఎం క్లాస్ సబ్మెరైన్ పునర్నిర్మాణం
ABN, Publish Date - Jul 25 , 2025 | 04:58 AM
రష్యా తయారీ ఈకేఎం క్లాస్ సబ్మెరైన్ పునర్నిర్మాణ (రీఫిట్) పనులను విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్ట్ లిమిటెడ్ (హెచ్ఎ్సఎల్) విజయవంతంగా పూర్తిచేసింది.
సంప్రదాయ సబ్మెరైన్ రీఫిట్ భారత్లో ఇదే తొలిసారి
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రష్యా తయారీ ఈకేఎం క్లాస్ సబ్మెరైన్ పునర్నిర్మాణ (రీఫిట్) పనులను విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్ట్ లిమిటెడ్ (హెచ్ఎ్సఎల్) విజయవంతంగా పూర్తిచేసింది. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న సమయంలోనే దీన్ని పూర్తిచేసినందుకు నేవీ వర్గాలు హెచ్ఎ్సఎల్ను అభినందించాయి. ఈ సందర్భంగా షిప్యార్డ్ సీఎండీ కమొడోర్ హేమంత్ ఖత్రి మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల అనుభవం, ఉద్యోగులు, కార్మికుల నిబద్ధత వల్లే ఈ రీఫిట్ పనులు సకాలంలో పూర్తి చేయగలిగామని చెప్పారు. ఒక సంప్రదాయ సబ్మెరైన్ను భారత షిప్యార్డ్లో రీఫిట్ చేయడం ఇదే మొదటిసారని ప్రకటించారు. ఇదే ఉత్సాహంతో స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ల రీఫిట్ పనుల కోసం కూడా పోటీ పడుతున్నామని చెప్పారు. వియత్నాం పీపుల్స్ నేవీతో సబ్మెరైన్ల రీఫిట్ కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 05:00 AM