ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - May 24 , 2025 | 11:09 PM
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈ) అధ్యక్షుడు ఎస్.ఇస్మాయిల్, అసోసియేట్ ప్రెసిడెంట్ బాలక్రిష్ణంరాజు తెలిపారు.
రైల్వేకోడూరు, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈ) అధ్యక్షుడు ఎస్.ఇస్మాయిల్, అసోసియేట్ ప్రెసిడెంట్ బాలక్రిష్ణంరాజు తెలిపారు. శనివారం రైల్వేకోడూరు పట్టణంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లో సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏలు, అరియర్స్ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన 5న చలో విజయవాడ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యదర్శి గల్లా రమణ, వైస్ ప్రెసిడెంట్ గురుమహేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 24 , 2025 | 11:09 PM