Nandyal District: కాడెద్దులతో ఒకేరోజు 25 ఎకరాల్లో కంది విత్తనం
ABN, Publish Date - Jul 05 , 2025 | 05:44 AM
కాడెద్దులతో ఒకే రోజు ఏకంగా 25 ఎకరాల్లో కంది విత్తనం వేసి ఔరా అనిపించాడు నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన రైతు శ్రీనివాసులు. రెండు రోజుల క్రితం...
నందికొట్కూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కాడెద్దులతో ఒకే రోజు ఏకంగా 25 ఎకరాల్లో కంది విత్తనం వేసి ఔరా అనిపించాడు నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన రైతు శ్రీనివాసులు. రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో శ్రీనివాసులు తాను కౌలుకు తీసుకున్న పొలంలో కంది సాగుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ఏకబిగిన మొత్తం 25 ఎకరాల్లో తన కాడెద్దులతో దున్నుతూ.. మరో ఇద్దరి సాయంతో కంది విత్తనం వేసి అందరినీ అబ్బురపరిచాడు.
Updated Date - Jul 05 , 2025 | 05:46 AM