రూ.13 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:33 AM
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని రాజానగరంలో సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకున్నారు.
రాజానగరం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని రాజానగరంలో సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు జాతీయ రహదారిలో బీపీసీఎల్ పెట్రోల్ బంకు లో ఏపీ39 -వి3299 నెంబరు కలిగిన అశోక్ లేలాండ్ లారీ పార్క్ చేసి ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనికీ చేసి పీడీఎస్ బియ్యం ఉన్న లారీని పట్టుకున్నట్టు రాజానగరం సివిల్ సప్లయిస్ డీటీ బాపిరాజు తెలి పారు. ఈ లారీ పల్నాడు జిల్లా నకి రేకల్లుకు చెందిన బెజ్జం రవీంద్రరెడ్డిదిగా గుర్తించామన్నారు.లారీ డ్రైవర్ పరార య్యాడన్నారు.పట్టుబడిన లారీలో బస్తా లతో 28,090 కిలోలు బియ్యం ఉన్నా యని,వీటి విలువ రూ.12,92,140గా గుర్తించామన్నారు. లారీ విలువ రూ.20 లక్షలుగా నిర్ధారించామన్నారు. పరారీలో ఉన్న డ్రైవర్పై రాజానగరం పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చేసినట్టు డీటీ తెలిపారు.
Updated Date - Jun 09 , 2025 | 12:33 AM