కిట్లు సకాలంలో పాఠశాలలకు చేరాలి
ABN, Publish Date - Jun 07 , 2025 | 01:28 AM
పభ్రుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు తయారీలో అప్రమత్తంగా ఉంటూ, సకాలంలో పాఠశాలలకు చేరే విధంగా కృషి చేయాలని రాష్ట్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల డైరెక్టర్ ప్రతాపరెడ్డి సూచించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల రాష్ట్ర డైరెక్టర్ ప్రతాపరెడ్డి
రంగంపేట హైస్కూల్ పరిశీలన
రంగంపేట, జూన్ 6(ఆంధ్రజ్యోతి): పభ్రుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు తయారీలో అప్రమత్తంగా ఉంటూ, సకాలంలో పాఠశాలలకు చేరే విధంగా కృషి చేయాలని రాష్ట్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల డైరెక్టర్ ప్రతాపరెడ్డి సూచించారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్ల నిర్వ హణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థి, తరగతుల వారీగా కిట్లను కట్టలుగా కట్టి పంపిణీకి సిద్ధం చేసిన సమగ్రశిక్ష ఉద్యోగులు, పార్ట్టెమ్ ఇన్ స్ట్రక్టర్లు, సీఆర్పీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటి వరకు బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, బెల్టులు, గ్రంథాలయ పుస్తకాలు, సామగ్రి చేరిందని, వాటిని పంపిణీకి సిద్ధం చేశామని మండల విద్యాశాఖాధికారి-2 పి.మధుసూధనరావు చెప్పారు. ఈ నెల 12వ తేదీలోపు పాఠశాల స్థాయికి కిట్లు అందే విధం గా చర్యలు తీసుకోవాలని ప్రతాపరెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సమగ్రశిక్ష ఏఎంవో గౌరీశంకర్, మధ్యాహ్నం భోజన పథకం అసి స్టెంట్ డైరెక్టర్ వి.వెంకట్రాజు, కాకినాడ జిల్లా ఐఈ కోఆర్డినేటర్ చామంతి నాగేశ్వరరావు, రంగంపేట క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు వి.పార్ధసారఽధి, మండల సమగ్ర శిక్ష ఉద్యోగులు, పార్ట్టెమ్ ఇన్ స్ట్రక్టర్లు, సీఆర్పీలు పాల్గొన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 01:28 AM