నేర్చుకుంటామంటే.. వచ్చేస్తోంది!
ABN, Publish Date - May 13 , 2025 | 01:06 AM
నిరుద్యోగ అభ్య ర్థుల వద్దకే వెళ్లి స్కిల్స్పై శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చు ట్టిందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడి వాసు అన్నారు. నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అనిల్, టీడీపీ నాయకులతో కలిసి సోమవారం మోరంపూ డిలో ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
రాజమహేంద్రవరంలో మొబైల్ ట్రైనింగ్ వాహనం ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ, మే 12(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ అభ్య ర్థుల వద్దకే వెళ్లి స్కిల్స్పై శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చు ట్టిందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడి వాసు అన్నారు. నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అనిల్, టీడీపీ నాయకులతో కలిసి సోమవారం మోరంపూ డిలో ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. దక్షిణ భారత దేశం లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక్క వాహనం రాజమహేంద్రవరంలో తొలిసారిగా ప్రారంభించడం ఆనందంగా ఉంద న్నారు.ఈ వాహనంలో స్కిల్ డవలప్మెంట్కు సంబ ంధించి 12 అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ మొబైల్ వాహనం యువత వద్దకే వెళ్లి శిక్షణ ఇస్తుందన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్,అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ సం యుక్త ఆధ్వర్యంలో యువత రూ.50 వేలు ఖర్చుపెట్టుకుని నేర్చుకునే కోర్సును ఉచి తం గా నేర్పించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Updated Date - May 13 , 2025 | 01:06 AM