పేదలకు గృహవసతి కల్పించాలని సీపీఐ ధర్నా
ABN, Publish Date - Jun 03 , 2025 | 01:16 AM
పేదలకు గృహవసతి కల్పించాలని తదితర డిమాండ్లతో సోమవారం తహసీల్దార్ కార్యాయం ముందు సీపీఐ ధర్నా నిర్వహించింది.
రామచంద్రపురం(ద్రాక్షారామ), జూన్ 2 (ఆంధ్రజ్యోతి): పేదలకు గృహవసతి కల్పించాలని తదితర డిమాండ్లతో సోమవారం తహసీల్దార్ కార్యాయం ముందు సీపీఐ ధర్నా నిర్వహించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిపి డిప్యూటీ తహసీల్దార్ మాధురికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పెద్దిరెడ్డి రాము, ఎస్.శారదాదేవి, వి.రాంబాబు, ర్యాలి సత్తిబాబు, టిడ్కో లబ్ధిదారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 01:16 AM