ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా ముత్యాలనాయుడు
ABN, Publish Date - May 14 , 2025 | 12:15 AM
అంబాజీపేట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా డాక్టర్ ఎం.ముత్యాలనాయుడును నియమించారు.
అంబాజీపేట, మే 13(ఆంధ్రజ్యోతి): అంబాజీపేట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా డాక్టర్ ఎం.ముత్యాలనాయుడును నియమించారు. ఇప్పటివరకు పనిచేసిన కేంద్ర అధిపతి డాక్టర్ ఎన్బీవీ చలపతిరావు తాడేపల్లిగూడెం వెంకటరామన్నగూడెంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఉద్యాన సమాచార కేంద్రానికి ప్రిన్సిపాల్ సైంటిస్టుగా పదోన్నతిపై వెళ్లారు. నూతనంగా నియమితులైన ముత్యాలనాయుడు ప్రస్తుతం కర్నూలు జిల్లా నంద్యాలోని మహానంది ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా పనిచేస్తున్నారు. ఆయన ఈనెల19న బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటివరకు స్థానిక కేంద్రంలో ఉన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి.గోవర్ధనరావు ఇన్చార్జ్ అధిపతిగా వ్యవహరించనున్నారు. ఈసందర్భంగా స్థానిక పరిశోధన కేంద్రంలో పదోన్నతిపై వెళ్తున్న చలపతిరావును స్థానిక శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.
Updated Date - May 14 , 2025 | 12:15 AM