అలవాటైనా..ఆయువు తీసింది..
ABN, Publish Date - May 04 , 2025 | 12:58 AM
ఉపాధి ఊపిరితీసింది.. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రా ణాలనే బలితీసుకుంది.
పెరవలి,మే 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధి ఊపిరితీసింది.. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రా ణాలనే బలితీసుకుంది..రొయ్యల చెరువులో ట్రాక్టర్తో దున్ని మట్టిని చదును చేసి గట్టున పోస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ వెనక్కువచ్చి తిరగబడి యజ మాని మృతిచెందినట్టు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. పెరవలి మండలం కానూరుకు చెందిన జన్ని రాంబాబు (50) శనివారం ఉదయం తన సొంత రెయ్యల చెరువులో మట్టి దుక్కు దున్నడానికి వెళ్లాడు. చెరువులో మట్టిని ట్రాక్టర్తో పైకి గెంటే క్రమంలో ట్రాక్టర్ అదు పుతప్పి బోల్తాపడింది. రాంబాబు ట్రాక్ట ర్ కింద ఇరుక్కుపోవడంతో చుట్టుపక్కల వారు అతన్ని తణుకు ప్రభుత్వ ఆసు పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య లక్ష్మి,కుమార్తె, కుమారుడు ఉన్నా రు. భార్య లక్ష్మి ఫిర్యాదు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు.
Updated Date - May 04 , 2025 | 12:58 AM