Whip ప్రతి ఇంటికీ తాగునీరు : విప్
ABN, Publish Date - Jun 13 , 2025 | 11:49 PM
అమృత-2 పథకం కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు
భూమిపూజ చేస్తున్న ప్రభుత్వ విప్ కాలవ
రాయదుర్గం, జూన 13(ఆంధ్రజ్యోతి): అమృత-2 పథకం కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. పట్టణంలోని పైతోటకు తాగునీటి సరఫరా పైప్లైన ఏర్పాటుకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ పథకం కింద మొలకాల్మూరు చెక్పోస్ట్ సమీపంలో తాగునీటి నిల్వ కోసం ప్రత్యేక ట్యాంక్ నిర్మిస్తామన్నారు. దాంతో పైతోటకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
Updated Date - Jun 13 , 2025 | 11:49 PM