ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఇప్పటికి 5 లక్షల బంగారు కుటుంబాలు

ABN, Publish Date - Jul 19 , 2025 | 04:19 AM

రాష్ట్రంలో 2029 నాటికి పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని.. పీ-4 ఆ దిశగా చేపట్టిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu
  • వీటికి 47 వేల మంది మార్గదర్శుల దన్ను

  • ఆగస్టు 15 కల్లా 15 లక్షలకుటుంబాల దత్తత నా సంకల్పం: సీఎం చంద్రబాబు

  • పీ-4 మార్గదర్శులకు విందు

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2029 నాటికి పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని.. పీ-4 ఆ దిశగా చేపట్టిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు 5 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని.. వీరికి చేయూతనిచ్చేందుకు 47 వేల మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని చెప్పారు. సీఎంగా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా.. పీ-4 తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమమని అన్నారు. పీ4లో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులకు శుక్రవారం ఉండవల్లి క్యాం పు కార్యాలయంలో ఆయన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. పీ-4 లక్ష్యాలను, దానిపై తన ఆలోచనలను పంచుకున్నారు. మార్గదర్శుల అభిప్రాయా లూ అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15 కల్లా 15 లక్షలబంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునే లా చూడాలనేది తన సంకల్పమని.. ఇందుకు సంపన్ను లు, కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని సీఎం కోరారు. గేట్స్‌ ఫౌండేషన్‌ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు.

నాడు జన్మభూమి.. నేడు పీ4

47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విడత సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఐటీకి పెద్ద పీట వేశామని, విద్యకు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇవన్నీ మంచి ఫలితాలిచ్చాయన్నారు. ‘తెలుగు ప్రజలు అన్నింటా అభివృద్ధి చెందారు. సంపద సృష్టించగలిగాం. దీంతో సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. జన్మభూమి వంటి కార్యక్రమం ద్వారా అందరినీ అభివృద్ధిలో భాగస్వాముల ను చేశాం. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేదల ను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలన్నదే నా సంకల్పం. పేదల భవిష్యత్‌ను బంగారుమయం చేసేందుకు పీ-4కి శ్రీకారం చుట్టాం’ అని తెలిపారు. చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు మార్గదర్శులు ప్రశంసించారు. ఇంతగా ఆలోచన చేసిన నాయకుడిని గతంలో తామెప్పుడూ చూడలేదని కొనియాడారు. విందు సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ కుటుంబరావు, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీనిరాజు, రవిసన్నారెడ్డి-శ్రీసిటీ, అనిల్‌ చలమలశెట్టి-గ్రీన్కో, డాంగ్‌ లీ-కియా మోటా ర్స్‌, పీవీ కృష్ణారెడ్డి-మెగా ఇంజనీరింగ్‌, ఏఏవీ రంగరాజు-ఎన్‌సీసీ, వీవీఎన్‌రావు-జీఎంఆర్‌, సజ్జన్‌కుమార్‌ గోయంకా- -జయరాజ్‌, ఇస్పాత్‌ లిమిటెడ్‌, దొరైస్వామి-బ్రాండిక్స్‌, సతీశ్‌రెడ్డి-రెడ్డి ల్యాబ్స్‌, సుచిత్రా ఎల్లా-భారత్‌ బయోటెక్‌, జయకృష్ణ-అమర్‌రాజా, శ్రీనివాసరావు-బీఎస్సార్‌, పూజా యాదవ్‌-హీరో మోటార్స్‌ కార్పొరేషన్‌, విక్రమ్‌ నారాయణరావు-లాయడ్‌ హెల్త్‌కేర్‌, ఇంద్రకుమార్‌-అవంతి ఫీడ్స్‌, శివప్రసాద్‌-హెచ్‌సీఎల్‌, గురు-సెల్‌ కాన్‌ మొబైల్స్‌, మాధవ్‌-రిలయెన్స్‌, పీవీ వెంకటరమణ రాజు-రామ్‌కో, ఎం శ్రీనివాసరావు-జెమిని ఎడిబుల్స్‌ సంస్థ పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 04:23 AM