Capital Development: 26న సింగపూర్కు చంద్రబాబు
ABN, Publish Date - Jul 14 , 2025 | 03:54 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 8 మంది మంత్రులు, అధికారుల బృందం ఈ నెల 26న సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది.
సీఎం నేతృత్వంలో 8 మంది బృందం పర్యటన
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 8 మంది మంత్రులు, అధికారుల బృందం ఈ నెల 26న సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది. ఈనెల 30వ తేదీ వరకు ఈ బృందం సింగపూర్లో పర్యటించనుంది.మంత్రులు లోకేశ్,నారాయణ,టీబీ భరత్, ఐఏఎస్ అధికారులు కాటంనేని భాస్కర్, ఎన్.యువరాజ్,కార్తికేయ మిశ్రా,కె.కన్నబాబు,సాయికాంత్ వర్మ ఈ బృందంలో ఉంటారు.పర్యటన ప్రధాన అజెండా రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడమేనని సమాచారం. సింగపూర్ నగర ప్రణాళిక, నగర సుందరీకరణ,ఉద్యానవనాలు,ఓడరేవులు,మౌలిక వసతుల కల్పన,భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి విషయాలను బృందం అధ్యయనం చేయనుంది.
Updated Date - Jul 14 , 2025 | 03:55 AM