ముక్కంటి క్షేత్రంలో యోగా
ABN, Publish Date - Jun 19 , 2025 | 01:44 AM
యోగాంధ్రలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తిలోని రాజగోపురం వద్ద యోగాసనాలు వేశారు. ఎమ్మెల్యే సుధీర్, కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. యోగాంధ్రలో భాగంగా జిల్లాలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.
యోగాంధ్రలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తిలోని రాజగోపురం వద్ద యోగాసనాలు వేశారు. ఎమ్మెల్యే సుధీర్, కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. యోగాంధ్రలో భాగంగా జిల్లాలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. యోగా.. మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రతను పెంచడం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు. జీవితంలో మార్పు.. ఆరోగ్యం కోసం రోజూ యోగాకు అరగంట కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్, పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా అధికారి జనార్దనరెడ్డి, ముక్కంటి ఆలయ ఈవో బాపిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, ఇతర అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి
Updated Date - Jun 19 , 2025 | 01:44 AM