టీచర్ల బదిలీ ప్రక్రియ మొదలైంది
ABN, Publish Date - May 22 , 2025 | 02:01 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ బుధవారం మొదలైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, మే 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ బుధవారం మొదలైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. గ్రేడ్-2 హెచ్ఎం/ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టినట్లు ఆమె తెలిపారు. 2025 మే 31 నాటికి 5/8యేళ్ల సర్వీసు ఒకేచోట పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు, హేతుబద్దీకరణలో పోస్టు బదలాయింపునకు గురైన ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి అని తెలిపారు. ఒకే స్టేషన్లో కనీసం 2 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు అభ్యర్థన బదిలీలకు అర్హులని ఆమె తెలిపారు.
Updated Date - May 22 , 2025 | 02:01 AM