9న షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం
ABN, Publish Date - Jun 07 , 2025 | 01:58 AM
పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులను ప్రదానం చేస్తోంది.
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అవార్డులు
హాజరుకానున్న జిల్లా ఇన్చార్జి మంత్రి
తిరుపతి(విద్య), జూన్ 6(ఆంధ్రజ్యోతి): పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులను ప్రదానం చేస్తోంది. జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమం సోమవారం మహతి ఆడిటోరియంలో జరుగనుంది. ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రూ.20 వేల చెక్, మెడల్, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి మండలానికి ఆరుగురు చొప్పున ఎంపిక చేశారు. మొత్తం 207 మంది ఎంపికయ్యారు. ఇంటర్ విద్యలో అత్యధిక మార్కులు సాధించిన 40 మందిని ఎంపిక చేశారు.
Updated Date - Jun 07 , 2025 | 01:58 AM