ఊపందుకున్న మామిడి వ్యాపారం
ABN, Publish Date - May 25 , 2025 | 01:09 AM
బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి కాయల వ్యాపారం ఊపందుకుంది.
బేనీషా రకం మామిడి కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
- బేనీషా రకం టన్ను ధర రూ.20-30వేలు
బంగారుపాళ్యం, మే 24 (ఆంధ్రజ్యోతి): బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి కాయల వ్యాపారం ఊపందుకుంది. శనివారం తీసుకొచ్చిన మామిడి కాయల్లో టేబుల్ రకాలైన బేనీషా టన్ను ధర రూ.20-30వేల మధ్య, ఖాదర్ రకం రూ.28-29వేల మధ్య, పుల్లూర కలర్ రకం రూ.12-16వేల మధ్య, జ్యూస్కి తరలించే పుల్లూర రకం రూ.8వేలు, నాటురకం టన్ను రూ.7వేల ధర పలికింది.
Updated Date - May 25 , 2025 | 01:09 AM