కపిలేశ్వరాలయంలో ‘స్వచ్ఛాంధ్ర’
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:12 AM
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో పారిశుధ్య కార్మికులతో కలసి సీఎం చంద్రబాబు చెత్త ఊడ్చారు. ఆలయాన్ని శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికులతో సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతికి నిత్యం లక్షమంది భక్తులు వస్తుంటారని, నగరం పరిశుభ్రంగా ఉంచాలంటే మీ చేతుల్లోనే ఉందన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం అందరం కలిసి పనిచేయాలన్నారు. ఆలయ అర్చకుల యోగక్షేమాలపై ఆరాతీశారు. కపిలేశ్వరుడికి కైంకార్యాలు ఎంత పవిత్రంగా పనిచేస్తారో, ఆలయ పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. అనంతరం కపిలేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
పారిశుధ్య కార్మికులతో కలసి చెత్త ఊడ్చిన సీఎం
తిరుపతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో పారిశుధ్య కార్మికులతో కలసి సీఎం చంద్రబాబు చెత్త ఊడ్చారు. ఆలయాన్ని శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికులతో సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతికి నిత్యం లక్షమంది భక్తులు వస్తుంటారని, నగరం పరిశుభ్రంగా ఉంచాలంటే మీ చేతుల్లోనే ఉందన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం అందరం కలిసి పనిచేయాలన్నారు. ఆలయ అర్చకుల యోగక్షేమాలపై ఆరాతీశారు. కపిలేశ్వరుడికి కైంకార్యాలు ఎంత పవిత్రంగా పనిచేస్తారో, ఆలయ పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. అనంతరం కపిలేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Updated Date - Jul 20 , 2025 | 01:12 AM