19న తిరుపతికి చంద్రబాబు
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:50 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19న తిరుపతికి విచ్చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు విచ్చేస్తున్నారు.
తిరుపతి(కలెక్టరేట్), జూలై 15(ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19న తిరుపతికి విచ్చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు విచ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సీఎం పాల్గొనే వేదికను సిద్ధం చేయడానికి మంగళవారం మధ్యాహ్నం దామినేడు సమీపంలోని తూకివాకం వద్ద తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన ఎస్డబ్ల్యూపీసీకేంద్రాన్ని, నగరంలోని ఎస్వీయూ స్టేడియం, ఎస్పీజేఎన్ఎం పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేదికను బుధవారం ఖరారు కానున్నట్లు ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Updated Date - Jul 16 , 2025 | 01:50 AM