ప్రధాని సభకు 70 బస్సులు
ABN, Publish Date - May 02 , 2025 | 01:12 AM
అమరావతిలో శుక్రవారం జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సభకు భారీ ఎత్తున జనం తరలివెళ్లారు. కలెక్టర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో 70 బస్సుల్లో సుమారు 3వేల మంది గురువారం రాత్రి బయలుదేరారు.
తిరుపతి (కలెక్టరేట్), మే 1(ఆంధ్రజ్యోతి): అమరావతిలో శుక్రవారం జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సభకు భారీ ఎత్తున జనం తరలివెళ్లారు. కలెక్టర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో 70 బస్సుల్లో సుమారు 3వేల మంది గురువారం రాత్రి బయలుదేరారు. సభ ముగియగానే తిరిగి స్వగ్రామానికి చేరుకునే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పిస్తున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. కాగా, తిరుపతితో పాటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచీ చాలావరకు బస్సులు అమరావతికి వెళ్లాయి. దీంతో తిరుపతి బస్టాండులో బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. శుక్రవారమూ ఇదే పరిస్థితి ఏర్పడనుంది.
Updated Date - May 02 , 2025 | 01:12 AM