వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
ABN, Publish Date - Jun 01 , 2025 | 01:05 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి వేల సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో క్యూలైన్లు ఆలయం వెలుపలకు వ్యాపించాయి.
ఆలయం వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
కాణిపాకంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఐరాల(కాణిపాకం), మే 31 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి వేల సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో క్యూలైన్లు ఆలయం వెలుపలకు వ్యాపించాయి. దీంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఈవో పెంచలకిషోర్ చర్యలు తీసుకున్నారు.
Updated Date - Jun 01 , 2025 | 01:05 AM