ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లె సీమలు మరింత కళకళలాడాలి: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jan 14 , 2025 | 03:30 AM

సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘సూ ర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజు శాస్త్రపరంగా అన్ని విధాలా ప్రాముఖ్యతను కలిగింది. అందుకే మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను పాటిస్తూ, సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ.. మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలి.’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.

  • గవర్నర్‌కు సీఎం ఫోన్‌

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్వగ్రామం నారావారిపల్లి పర్యటనలో ఉన్న సీఎం .... సోమవారం రాత్రి గవర్నర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 14 , 2025 | 03:30 AM