Eluru District: సీఎంపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:23 AM
సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చిన్నంపేటకు చెందిన వెదుళ్ల ప్రసాద్పై కేసు...
వ్యక్తిపై కేసు నమోదు
చాట్రాయి, జూలై 26(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చిన్నంపేటకు చెందిన వెదుళ్ల ప్రసాద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి.రామకృష్ణ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 24వ తేదీ గురువారం వెదుళ్ల ప్రసాద్ తన ఫేస్బుక్ అకౌంట్లో, అనుచిత వ్యాఖ్యలతో సీఎం చంద్రబాబుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పోస్టు పెట్టాడన్నారు. దీనిపై టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు తదితరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
Updated Date - Jul 27 , 2025 | 05:26 AM