అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:02 AM
అం తరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఏపీ సైన్సు సిటీ సీఈవో కేశి నేని వెంకటేశ్వర్లు అన్నారు.
ఏపీ సైన్స సిటీ సీఈవో
కేశినేని వెంకటేశ్వర్లు
బాలికల ఉన్నతపాఠశాలలో
వైజ్ఞానిక ప్రదర్శన
బనగానపల్లె, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అం తరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఏపీ సైన్సు సిటీ సీఈవో కేశి నేని వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ప ట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠ శాలలో స్పేస్ ఎడ్యుకేషనపై నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాల విద్యార్థులకు విద్యారంగంలో వినూత్న ఆవిష్కరణకు వీలు కల్పించే విధం గా మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశాల మేరకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించామన్నారు. విద్యాశాఖామంత్రి నారాలోకేశ ఆలోచనలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అంత రిక్షం, విజ్ఞానంపై సమగ్ర అవగాహన కల్పిం చేందుకు ఈప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలి పారు. స్పేస్ సంబంధి త పరికరాలు కలపడం, విడదీయడం, ప్రాక్టికల్ గా వివరించారు. దేశ రక్షణలో డ్రోన ఆవశ్యక తను వివరించారు. చం ద్రయాన ప్రయోగాల్లో రోవర్ పనితీరును వివ రించారు. చంద్ర యాన ల్యాండ్ అయ్యే విధా నం ప్రదర్శనా పూర్వ కంగా చూపారు. యుద్ధంలో వాడే రాకెట్లు, డ్రోనలు, ఇతర ఆ యుధాలు ఎలా పని చేస్తాయి... శత్రువుల నుం చి దాడిని ఎలా ఎదుర్కొవాలనే విష యాలను రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థుల కు వి వరించ నున్నట్లు ఆయ న తెలిపారు. కార్యక్ర మంలో డిప్యూటీ వి ద్యాధికారి వెం కట రామిరెడ్డి, విద్యాధి కారి స్వరూప, హెచఎం వరప్రసాదరావు, టీ చర్ శ్రీనివాసరెడ్డి, ముస్కాన కంపెని ప్రతినిధులు, ఉపాధ్యా యులు, ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల , కస్తూర్బా విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 12:02 AM