ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CS Vijayanand: 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత

ABN, Publish Date - Jul 25 , 2025 | 05:11 AM

రాష్ట్రంలో ఆగస్టు 15నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేవిధంగా లక్ష్యాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ జిల్లా కలెక్టర్లు...

  • మార్గదర్శుల లక్ష్యాన్ని పూర్తి చేయాలి: సీఎస్‌

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆగస్టు 15నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేవిధంగా లక్ష్యాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌, సిటీ గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ, ‘ఇప్పటివరకు 6.57లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. మిగతా లక్ష్యాన్ని కూడా త్వరగా పూర్తిచేయాలి. నీడ్‌ అసెస్మెంట్‌ సర్వేను ఆగస్టు 5లోగా పూర్తి చేయాలి. రాష్ట్రంలో 540 కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్లను గుర్తించి, ఆయా శాఖలకు పంపాము. వాటిపై జిల్లా అధికారులతో చర్చించి, లక్ష్యసాధనకు చర్యలు తీసుకోవాలి’ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 05:12 AM