ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Higher Education: 18న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

ABN, Publish Date - Aug 03 , 2025 | 05:40 AM

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తాత్కాలిక షెడ్యూలు రూపొందించింది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీచేయాలని భావిస్తోంది.

  • 27న సీట్ల కేటాయింపు, 28 నుంచి తరగతులు

  • తాత్కాలిక షెడ్యూలు విడుదల

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తాత్కాలిక షెడ్యూలు రూపొందించింది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీచేయాలని భావిస్తోంది. ఈలోగా ఈనెల 4 వరకు కాలేజీలు కోర్సులను సింగిల్‌ మేజర్‌లోకి మార్చుకునేందుకు గడువు పొడిగించింది. 7న సింగిల్‌ మేజర్‌పై నిబంధనలు జారీ చేయనుంది. 9 నుంచి 16 వరకు కాలేజీలకు యూనివర్సిటీలు అఫిలియేషన్లు మంజూరుచేస్తాయి. 18 నంచి 20వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు గడువు ఇస్తారు. 27న సీట్లు కేటాయించి, 28 నుంచే తరగతుల ప్రారంభించేందుకు అనుమతిస్తారు. కాగా, ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. విద్యార్థులు నేరుగా కాలేజీలకు వెళ్లి దరఖాస్తు సమర్పిస్తారు. అయితే దానిని కూడా ఆన్‌లైన్‌ చేస్తారు. ఒకవేళ విద్యార్థి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండిటిలోనూ దరఖాస్తు చేసుకుంటే ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో కోరుకున్న కాలేజీలో సీటు రాకపోతే ఆన్‌లైన్‌ ఎంపికలు తర్వాతి ప్రాధాన్యతలో ఉంటాయి.

Updated Date - Aug 03 , 2025 | 05:44 AM