Maoist leaders: మృతదేహాల కోసం ఛత్తీస్గఢ్ పోలీసులను అడగండి
ABN, Publish Date - May 25 , 2025 | 05:00 AM
ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేతలు కేశవరావు, నాగేశ్వరరావు మృతదేహాల అప్పగింతపై ఛత్తీస్గఢ్ పోలీసులను సంప్రదించాలని వారి కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టు సూచించింది. మృతదేహాల అప్పగింతపై నిర్ణయం స్థానిక పోలీసుల పరిధిలోనిదని ధర్మాసనం తెలిపింది.
మావోయిస్టుల కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టు సూచన
అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, అగ్రనేత సజ్జా వెంకట నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించాలని ఛత్తీ్సగఢ్ పోలీసులను కోరాలని వారి కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఛతీ్త్సగఢ్ పోలీసులను ఆశ్రయించే వ్యవహారాన్ని పిటిషనర్లకే వదిలేసింది. వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు ధర్మాసనం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. తమ వారి మృతదేహాలను అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేశవరావు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం అత్యవసరంగా హైకోర్టులో హౌజ్మోషన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. మృతదేహాలను అప్పగించాలని ఛతీ్త్సగఢ్లోని నారాయణ్పూర్జిల్లా పరిధి ఐజీని పిటిషనర్లు సంప్రదిస్తే.. అక్కడి పోలీసులు బెదిరించి పంపించి వేశారని చెప్పారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకే పోలీసులు మృతదేహాలను అప్పగించడం లేదన్నారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఎన్కౌంటర్ మృతుల పోస్టుమార్టం ముగిసిందా? అని ప్రశ్నించింది. ఛత్తీ్సగఢ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రఫుల్ భరత్ స్పందిస్తూ.. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది చనిపోగా, కేశవరావు, నాగేశ్వరరావులతో పాటు 21మందికి పోస్టుమార్టం ముగిసిందని, మరో ఆరుగురికి శనివారం సాయంత్రంలోగా పూర్తిచేస్తామని చెప్పారు. ఆ తరువాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించడమే మిగిలి ఉంటుందన్నారు. రాష్ట్ర ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు ఛత్తీ్సగఢ్ హైకోర్టును ఆశ్రయించి ఉండాల్సిందన్నారు. కేంద్ర హోంశాఖ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎ్సజీ) పసల పొన్నారావు వాదనలు వినిపిస్తూ.. అంతిమ సంస్కారాల సందర్భంగా ర్యాలీలు నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందనే కారణంతో మృతదేహాలను అప్పగించడానికి నిరాకరించి ఉండొచ్చని తెలిపారు. అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఛత్తీ్సగఢ్ ఏజీ వాదనలు గుర్తుచేస్తూ.. మృతదేహాల అప్పగింతపై ఛతీ్త్సగఢ్ పోలీస్ అధికారులను ఆశ్రయించే వ్యవహారాన్ని పిటిషనర్లకే వదిలేసింది.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్ఫోన్లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..
Updated Date - May 25 , 2025 | 05:00 AM