AP High Court: పేర్నినాని, కైలే అనిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
ABN, Publish Date - Jul 25 , 2025 | 04:31 AM
వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పామర్రు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ....
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పామర్రు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ పార్టీ నేతలు పేర్నినాని, కైలే అనిల్ కుమార్ వేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. వీరిపై తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 04:34 AM