ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nayee Brahmins Salary: నాయీబ్రాహ్మణుల కనీస వేతనం 25 వేలకు పెంపు

ABN, Publish Date - Apr 25 , 2025 | 04:03 AM

ఆంధ్రప్రదేశ్‌లోని 44 ఆలయాల్లో తలనీలాలకు సేవలు అందించే నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవదాయ శాఖపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కొత్తగా 89,788 మందికి వితంతు పింఛన్లు

44 ఆలయాల్లో తలనీలాల విధులు నిర్వహించే వారికి అమలు

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆలయాల్లో తలనీలాలకు సంబంధించిన విధులు నిర్వహించే నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం కింద రూ.25 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆంగీకరించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి జి.జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ‘6ఏ’ కింద దాదాపు 175 ఆలయాలున్నాయి. అందులో 44 ఆలయాల్లో మాత్రమే భక్తులు నిత్యం తలనీలాలు సమర్పిస్తుంటారు. ఈ ఆలయాల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల కనీస వేతనాన్ని అమలు చేయనున్నారు. దీంతో ఎన్నికలముందు దేవదాయ శాఖపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం వంద శాతం పూర్తి చేసింది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:03 AM