AP Jaljeevan Mission: రాష్ట్ర జల్జీవన్ కార్పొరేషన్ ఏర్పాటు
ABN, Publish Date - Jul 23 , 2025 | 05:48 AM
రాష్ట్రంలో జల్జీవన్ మిషన్ పనులు కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల చట్టం-2013 కింద ఆంధ్రప్రదేశ్ జల్జీవన్ వాటర్...
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల్జీవన్ మిషన్ పనులు కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల చట్టం-2013 కింద ఆంధ్రప్రదేశ్ జల్జీవన్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కార్పొరేషన్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్గా, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ వైస్ చైర్మన్గా, ఆర్థిక, మున్సిపల్, ఆర్అండ్బీ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు, జలవనరుల, అటవీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు.
Updated Date - Jul 23 , 2025 | 05:49 AM