Minister BC Janardhan Reddy: ఏవియేషన్ హబ్గా ఏపీ
ABN, Publish Date - Jul 25 , 2025 | 05:02 AM
విమానయాన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. విమాన తయారీ, పైలట్ శిక్షణ సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు...
మంత్రి బీసీ జనార్దనరెడ్డితో ఆయా సంస్థల ప్రతినిధుల భేటీ
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): విమానయాన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. విమాన తయారీ, పైలట్ శిక్షణ సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామంటూ 9 ఫ్లయింగ్ ట్రైనింగ్, 2 విమాన తయారీ సంస్థలు ఆసక్తి చూపాయి. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయా సంస్థల ప్రతినిధులతో మంత్రి బీసీ జనార్దనరెడ్డి సమావేశమయ్యారు. రూ.600 కోట్ల పెట్టుబడులకు స్కై బర్డ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసక్తి చూపింది. రూ.210 కోట్ల పెట్టుబడులకు ఎఫ్టీవో అండ్ హెలీ టాక్సీ సంస్థ ముందుకు వచ్చింది. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు ఫిలెక్స్ ఏవియేషన్ అకాడమీ సంసిద్ధత తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 05:03 AM