ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

drinking water తాగునీటి కోసం రాస్తారోకో

ABN, Publish Date - Jun 24 , 2025 | 12:14 AM

తమ కాలనీలకు 80 రోజులకు పైగా తాగునీరు సరఫరా కావడం లేదని, వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని వడ్డెబండ, కుమ్మర వీధి, గాజుల వీధి, రాచప్ప కుంట కాలనీలకు చెందిన మహిళలు డిమాండ్‌ చేశారు.

ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న మహిళలు, నాయకులు

కళ్యాణదుర్గం, జూన 23(ఆంధ్రజ్యోతి): తమ కాలనీలకు 80 రోజులకు పైగా తాగునీరు సరఫరా కావడం లేదని, వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని వడ్డెబండ, కుమ్మర వీధి, గాజుల వీధి, రాచప్ప కుంట కాలనీలకు చెందిన మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని టీ సర్కిల్‌లో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌ మూడు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌ మద్దతుపలికారు.

Updated Date - Jun 24 , 2025 | 12:15 AM