Strict action రసాయనాలు వాడితే కఠిన చర్యలు
ABN, Publish Date - May 22 , 2025 | 11:51 PM
సత్యసాయి జిల్లాలో ఎవరైన మామిడి, యాపిల్ ఇతర పండ్లను హానికర రసాయనాలతో మాగపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇనస్పెక్టర్ రామచంద్ర హెచ్చరించారు.
పండ్లను పరిశీలిస్తున్న జిల్లా ఫుడ్ ఇనస్పెక్టర్
ధర్మవరం, మే 22(ఆంధ్రజ్యోతి): సత్యసాయి జిల్లాలో ఎవరైన మామిడి, యాపిల్ ఇతర పండ్లను హానికర రసాయనాలతో మాగపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇనస్పెక్టర్ రామచంద్ర హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ధర్మవరం పట్టణంలో ఐదు మండీలను తనిఖీ చేసి వాటిలో సాంపిల్స్ తీసుకుని హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. పండ్లను రసాయనాలతో మాగపెడుతున్నట్టు తెలితే ఎఫ్ఎ్సఎ్ససీఐ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఆయన తెలిపారు.
Updated Date - May 22 , 2025 | 11:51 PM