ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sriharikota ప్రతిభావంత విద్యార్థులకు విజ్ఞాన యాత్ర

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:24 PM

సాంకేతిక రంగాల్లో తమదైన ప్రతిభ కనబరచిన స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థినులకు సత్యసాయి జిల్లా విద్యాశాఖ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసింది.

శ్రీహరికోట వద్ద గాండ్లపెంట విద్యార్థినులు

గాండ్లపెంట, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : సాంకేతిక రంగాల్లో తమదైన ప్రతిభ కనబరచిన స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థినులకు సత్యసాయి జిల్లా విద్యాశాఖ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసింది. ఈ యాత్రలో భాగంగా ఆ విద్యార్థులు గురువారం శ్రీహరికోట (అంతరిక్ష పరిశోధన కేంద్రం)ను సందర్శించారు. విద్యార్థులు ఆరీషా, సాధబ్‌, లిఖిత, యశ్వనీ, శమఫిర్‌దోష్‌, మోక్షిత, నీహతబ్‌సుమ్‌, గీతిక, పూజిత ఆ పరిశోధన కేంద్రంలో పలు రాకెట్‌, శాటిలైట్ల నమూనాలను పరిశీలించారు. వీరి వెంట ఉపాధ్యాయులు ఓబులరెడ్డి, రాజారత్నం ఉన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:24 PM