FIRE : ఆరని చిచ్చు
ABN, Publish Date - Mar 09 , 2025 | 11:54 PM
నగరంలో ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మంటలు రగులు తూనే ఉన్నాయి. దాదాపు వారం రోజులుగా మెల్లమెల్లగా మై దానం మొత్తం విస్తరిస్తోంది. అకతాయిలు వేసిన నిప్పురవ్వకు చెట్లు బూడిద అవుతున్నాయి.
అనంతపురం సెంట్రల్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : నగరంలో ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మంటలు రగులు తూనే ఉన్నాయి. దాదాపు వారం రోజులుగా మెల్లమెల్లగా మై దానం మొత్తం విస్తరిస్తోంది. అకతాయిలు వేసిన నిప్పురవ్వకు చెట్లు బూడిద అవుతున్నాయి. దీనికి నివారించేందుకు తగిన సిబ్బింది లేకపోడం, మైదాన నిర్వహణకు తగిన నిధులు వినియోగానికి అనుమతి లేకపోవడం తదితర కారాణాల రీత్యా వర్షాకాలం ఏపుగా గడ్డి పొదళ్లు పెరగడం. వేసవిలో అగ్గిరవ్వలకు అహుతి కావడం షరామామూలుగా మారింది. కొన్ని సంవత్స రాలుగా ఇదే వరుస కొనసాగుతోందని విద్యార్థులు గుర్తుచేసు కుంటున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల హాస్టళ్లలో ఉంటున్న వి ద్యార్థులు ఎప్పుడు ఏమవుతోందనని భయాందోళనకు గురువుతు న్నారు. కాగా నీరు-చెట్టు కింద మొక్కలు నాటి, ఎక్కడిక్కడ వర్షపు నీరు ఇంకేలా గుంతలు తీశారు. దీంతో వర్షపు నీటికి మొక్కలు వృక్షాలైనా వాటిని సంరంక్షించుకోలేని పరిస్థితి నెలొకందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Mar 09 , 2025 | 11:54 PM