• Home » Anantapur urban

Anantapur urban

ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి

ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి

నగరంలో కేంద్రప్రభుత్వం అందించే ఎనక్యా్‌ప నిధులకు సంబంధించిన అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు వెంటనే అనుమతివ్వాలని ఎస్‌వి ఇనఫ్రా కాంట్రాక్టర్‌ శ్రీనివాసచౌదరి కోరారు.

కిక్కిరిసిన కలెక్టరేట్‌.. 751 అర్జీల స్వీకరణ

కిక్కిరిసిన కలెక్టరేట్‌.. 751 అర్జీల స్వీకరణ

స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌లతో కలెక్టర్‌ కార్యాలయం ఆవరణం కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 751 వినతులు అందజేశారు.

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం అనంతపురం రూరల్‌ తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో బీజేపీ నాయకులు కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

పారిశుధ్య సిబ్బంది యాప్రాన ధరించాలి

పారిశుధ్య సిబ్బంది యాప్రాన ధరించాలి

నగరంలో పారిశుధ్య సిబ్బంది విధులలో కచ్చితంగా యాప్రాన ధరించాల్సిందేనని నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు ఆదేశించారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్‌హాల్‌లో పారిశుధ్యం మెరుగునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ప్రకృతి వ్యవసాయంతోనే ప్రజలకు ఆరోగ్యం

ప్రకృతి వ్యవసాయంతోనే ప్రజలకు ఆరోగ్యం

ప్రకృతి వ్యవసాయంతోనే పజ్రల ఆరోగ్యానికి రక్ష అని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపును అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ అన్నారు. పీఎం 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా శనివారం రెడ్డిపల్లి కృషి విజ్ఞానకేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంత

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంత

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంతపురం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కొవ్వూరునగర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌, అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే చీపురు పట్టి..చెత్త ఊడ్చి రోడ్లను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇంటింటా పరిశుభ్రతపై పోస్టర్లు అతికిస్తూ స్వచ్ఛ అనంత కోసం కట్టుబడి ఉంటామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

రైతులకు అండగా ముఖ్యమంత్రి

రైతులకు అండగా ముఖ్యమంత్రి

: సీఎం చంద్రబాబు రైతులకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. నవ ధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌, ముగ్గులను పరిశీలించి, అన్నదాత సుఖీభవ మెగా చెక్కు అందచేశారు.

మరోసారి బుల్లెట్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి.. తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు

మరోసారి బుల్లెట్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి.. తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరోసారి బుల్లెట్ ఎక్కి నగర వీధుల్లో పర్యటించారు. గురువారం నాడు తెల్లవారుజామున 5 గంటలకే ఓల్డ్ టౌన్‌లోని 5వ మస్టర్‌ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రాణాలు కాపాడే సేవకులు రక్తదాతలు

ప్రాణాలు కాపాడే సేవకులు రక్తదాతలు

ప్రాణాప్రాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే నిస్వార్థ సేవకులు రక్తదాతలు అని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ విజయశ్రీ అన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవానికి పురస్కరించుకుని సర్వజన వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో శనివారం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి