Home » Anantapur urban
వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నసనకోట పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు.
తపాలా శాఖ లో ఆధునిక పద్ధతులకు అనుగుణంగా సేవలను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం (జీడీఎస్) నాయకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కోరారు.
ప్రభుత్వం సీహెచసీ గ్రూపుల ద్వారా అందించిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రబృందం సభ్యులు సూచించారు.
సమాజంలో విస్తరిస్తున్న లింగ వివక్షను రూపుమాపేలా మహిళలు నడుం బిగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ కేఎ్సఎన బాలికల డిగ్రీ కళాశాలలో ‘గర్భస్త శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం’ అమలుపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేలా ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ఐసీడీఎస్ పీడీ శశికళతో కలిసి జిల్లా మా తా, శిశు సంక్షేమ శాఖపై సమీక్షించారు.
ప్రజాసమస్యలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా జనతా వారధి ప్రారంభించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ అన్నారు.
చేస్తున్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. శుక్రవారం ఆమె అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పీఆర్ సబ్డివిజన-1 డీఈ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
అనంతపురం ఇనచార్జి జేడీఏ రవిపై ఈ నెల 22, 23 తేదీల్లో విచారణ జరగనుంది. ఇక్కడ జేడీఏగా పనిచేసిన ఉమామహేశ్వరమ్మ గత ఏడాది డిసెంబరు నెలాఖరులో ఉద్యోగ విరమణ చెందారు. దీంతో తాడిపత్రి డివిజన ఏడీఏ రవికి ఇనచార్జి జేడీఏగా బాధ్యతలు అప్పగించారు. ఆయనపై అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఇటీవల ఫిర్యాదు చేశారని సమాచారం.
నేషనల్ పార్క్లో నీటి వనరులు మెరుగుపరిచే విధంగా పనులు చేపడుతున్నట్లు అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేషనల్ పార్క్లో ఆయన పర్యటించారు. ఈవారం జలధార-జలహారతి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.