Home » 2025
మండల కేంద్రానికి సమీపం లో ఎం. కొత్తపల్లి వద్ద బం డపై వెలసిన అ య్యప్ప స్వామి సన్నిధానంలో స్వామి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువా రం ఆలయ నిర్మాణ సంకల్ప కులు పచ్చార్ల ఆంజినేయులు నాయుడు ఆధ్వర్యంలో స్వా మి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
గత వైసీపీ పాలనలో ఇరగంపల్లి నుంచి తలమర్ల గ్రామం వరకు తారురోడ్డు నిర్మించలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి సహకారంతో ఇరగంపల్లి నుంచి తలమర్లకు తారురోడ్డు ఏర్పా టు చేశారు.
గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలు దూరం అవుతాయని డీఎస్పీ హేమంత కుమార్ తెలిపారు. మండలపరిధిలోని ముస్టూరు లో గురువారం రాత్రి డీఎస్పీ హేమంతకుమార్ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ... గ్రామలలో ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ముందు జాగ్రత్తగా గ్రామ పెద్దల ద్వారా గానీ, పోలీసుల దృష్టికి తీసుకొచ్చి గానీ పరిష్కరించుకోవాలని సూచించా రు.
మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా గురువా రం పట్టణంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొ న్నారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ కవర్గాల వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను ప్రత్యేకంగా విద్యుత దీపాలతో అలంకరించారు.
బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ధర్మవరంలో బుధవారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేప ట్టారు. కాలేజ్ సర్కిల్ నుంచి కళాజ్యోతి సర్కిల్ మీదుగా సాగింది. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
భక్తి భావంతో దేశ సమై క్యత కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని శృంగేరి విరూపాక్ష మఠం పీఠానికి చెందిన విద్యానృసింహభారతి పేర్కొన్నారు. మతమార్పిడి, మ త విద్వేషాలను నిరోధించాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రం లోని గీతా మందిరంలో బుధవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మే ళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్ముగా భావించి అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన బా ధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంటుంది. అయితే ఆ బాధ్యత ఎక్కడ కనిపిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల కష్టార్జి తాన్ని పన్నుల రూపంలో కట్టిన ప్రభుత్వ ధనంతో రూ. లక్షలు ఖర్చుచేసి కొను గోలు చేసిన టయోటా ఇన్నోవా వాహనం ప్రస్తుతం ఉపయోగం లేకుం డా మూలన పడింది.
దీర్ఘకాలికంగా నెలకొన్న చుక్కల భూముల సమస్య పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్న ట్లు ఆర్డీఓ సువర్ణ పేర్కొన్నారు. మండలంలోని కొండకమర్ల గ్రామ సచివాలయం ఆవరణం లో బుధవారం చుక్కల భూముల సమస్య పరిష్కారంపై గ్రామసభ నిర్వ హించారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వెలసిన చర్చీలు బుధవారం రాత్రి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ పండుగ గురువారం కావడంతో పట్టణంలోని ఆయా చర్చీలను అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రైల్వేస్టేషన క్యాంపస్, మార్కెట్ వీధి, జోగోనికుంట, కొత్తపేట, శ్రీలక్ష్మీచెన్నకేశవపురం, నె హ్రూనగర్లోని చర్చీలు క్రిస్మస్ సందర్భంగా ముస్తాబయ్యాయి.