Home » 2025
సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు శీరోధార్యమంటూ శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సింగపూర్ ప్రతినిధి విలియం పేర్కొన్నారు. గురువారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో సింగపూర్ భక్తులు సంగీత కచేరి నిర్వహించారు.
మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలలో నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్ హారీష్బాబు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా, సమయబద్ధంగా మార్చడంలో డీడీఓ కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది.
పట్టణంలోని సాయినగర్ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు.
రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఆ యన బుఽధవారం పట్టణం లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్కు రెండు తెలుగురాష్ట్రాలూ సమానమే అన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహిస్తే మిగతావారితో సమంగా రాణించగలరని జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి మజీదు సయ్యద్ పస్పల్లా పేర్కొన్నారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయాధికారితో పాటు సీఐ మారుతీశంకర్, బార్ అసోసియేషన ప్రెసిడెంట్ గంగిరెడ్డి, ఎంఈఓ-1 సోమశేఖర్నాయుడు, ఎంఈఓ-2 జయచంద్ర ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.
స్థానిక ఎంపీపీ ప్రసాద్ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్ శర్మ హాజరయ్యారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.