yoga యోగాతో మానసిక ప్రశాంతత : ఎస్పీ
ABN, Publish Date - May 23 , 2025 | 11:05 PM
నేటి యాంత్రిక యుగంలో యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎస్పీ వీ.రత్న పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లాపోలీసు కార్యాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పుట్టపర్తిరూరల్, మే 23(ఆంధ్రజ్యోతి): నేటి యాంత్రిక యుగంలో యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎస్పీ వీ.రత్న పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లాపోలీసు కార్యాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి జూన 21 వరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందితో కలసి యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయ్కుమార్, ఆదినారాయణ, ట్రైనీ డీఎస్పీ ఉదయపావని, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సీఐలు సునీత, నరేందర్రెడ్డి, బొజ్జప్ప, ప్రవీణ్కుమార్, ఆర్ఐలు వలి, మహేష్, ఎస్సైలు లింగన్న, మల్లికార్జునరెడ్డి, కృష్ణమూర్తి, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 11:05 PM